Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్

Advertiesment
pawan - nadendla
, శుక్రవారం, 7 జులై 2023 (09:07 IST)
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర రెండో దశ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. గత నెల 14వ తేదీన అన్నవరంలో తొలి దశ యాత్ర ప్రారంభమైన విషయం తెల్సిందే. ఇపుడు రెండో దశ యాత్రను 9వ తేదీన ఏలూరు నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌తో పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. ఏలూరులో తలపెట్టే ప్రచారాన్ని భారీ బహిరంగ సభతో ప్రారంభిచాలని నిర్ణయించారు. 
 
గత నెల 14వ తేదీన అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి విజయ యాత్ర రెండో దశ ఏలూరు నుంచి ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ సంకల్పించారని జనసేన పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండో యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌‌తో సుధీర్ఘంగా చర్చించారు. 
 
9వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుందని, ఈ వారాహి విజయ యాత్ర ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లి గూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ప్రత్యేకంగా సమావేశమై స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. 
 
ఒక్క ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ గుండెల్లో గునపం దింపిన పవన్   
 
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు విడాకులు ఇవ్వనున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీలోని అధికార వైకాపాకు చెందిన పేటీఎం బ్యాచ్ ఈ అసత్య ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఒక దశలో నిజమేనా అనేలా చేసింది. ఈ ప్రచారంపై జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అదేసమయంలో పవన్ కళ్యాణ్ తనదైనశైలిలో బదులిచ్చారు. ఒకే ఒక్క ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ గుండెల్లో గునపం దించారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ చేసిన ఓ ట్వీట్‌తో పేటీఎం బ్యాచ్‌ దుష్ప్రాచారానికి తాళం పడింది. "జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, అనా కొణిదెల - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ నగరంలోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెలవు పెట్టకుండా 74 యేళ్ల పాటు విధులు- 90 యేళ్లకు రిటైర్