Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తిని వదిలి వెళ్లిన బెర్లుస్కోని ప్రధాని

Webdunia
సోమవారం, 10 జులై 2023 (09:46 IST)
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని తన ప్రియురాలికి ఏకంగా రూ.900 కోట్ల విలువ చేసే ఆస్తిని వదిలి వెళ్లారు. ఈయన గత నెలలో తుదిశ్వాస విడిచారు. 86 యేళ్ల బెర్లుస్కోని లుకేమియాతో బాధపడుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అయితే, బెర్లుస్కోనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
బెర్లుస్కోని గత కొంతకాలంగా మార్తా ఫాసినా అనే 33 యేళ్ల మహిళతో ప్రేమాయణం సాగిస్తూ వచ్చారు. ఇద్దరి మధ్య 53 యేళ్ళ వయోభేదం ఉన్నప్పటికీ బెర్లుస్కోని వయసును ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేమ కొనసాగిస్తూ వచ్చారు. అదేసమయంలో ఆయన లుకేమియా వ్యాధితో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో తన ప్రియురాలికి ఏకంగా రూ.900 కోట్ల విలువ చేసే ఆస్తిని రాశారని, ఆ మేరకు వీలునామాలో పేర్కొన్నారంటూ ప్రఖ్యాత మీడియా సంస్థ బ్లూంబెర్గ్ వెల్లడించింది.
 
ఇటలీ కుబేరుల్లో ఒకరైన బెర్లుస్కోని మొత్తం సంపద విలువ రూ.4.6 లక్షల కోట్లు. అందులో రూ.900 కోట్లు రాసివ్వడం పెద్ద విషయం కాదని పలువురు అంటున్నారు. అయితే, ఫాసినాకు మాత్రం ఇది ఊహించని బొనాంజానే. మాజీ ప్రధానితో ఆమె డేటింగ్ చేసినందుకు ఏకంగా రూ.900 కోట్ల ఆస్తి సమకూరింది. ఫాసినా కూడా ఓ రాజకీయ నాయకురాలే కావడం గమనార్హం. ఇటలీ చాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌లో ఆమె 2018 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments