Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (08:50 IST)
తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి వాపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో దూషించినందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైవుండగా, ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని బోరున విలపించారు. తనపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికి రెండు ఆపరేషన్లు జరిగాయని, స్టెంట్లు వేశారని గుర్తుచేశారు. 70 యేళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే శరణ్య. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోసానికి పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై అదులోకి తీసుకోవడంతో విడుదల సాధ్యపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల క‌థాంశంతో మోహ‌న్.జి భారీ చిత్రం ద్రౌప‌తి -2 ఫ‌స్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments