Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (08:50 IST)
తనపై అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి వాపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరుష పదజాలంతో దూషించినందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదైవుండగా, ఈ కేసుల్లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో కోర్టులో హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి గుంటూరుకు తీసుకొచ్చి, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని బోరున విలపించారు. తనపై వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారన్నారు. తన ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికి రెండు ఆపరేషన్లు జరిగాయని, స్టెంట్లు వేశారని గుర్తుచేశారు. 70 యేళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారు. తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే శరణ్య. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోసానికి పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై అదులోకి తీసుకోవడంతో విడుదల సాధ్యపడలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments