గ్రామాల్లో మొద‌లైన రాజ‌కీయ క‌క్ష‌లు...కొప్ప‌ర్రులో టీడీపీ నేత గృహ‌ ద‌హ‌నం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:56 IST)
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డటంతో, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు గ్రామాల్లో రాజ‌కీయ క‌క్ష‌లు మ‌రోసారి వెలుగు చూస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో పొడ‌చూపిన విభేదాలు, ఇపుడు మ‌ళ్లీ ఫ‌లితాల వెల్ల‌డితో భ‌గ్గుమంటున్నాయి.
 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో  వినాయకుడి ఊరేగింపులో టి.డి.పి., వై.సి.పి  కార్యకర్తల మధ్య వివాదం చెల‌రేగింది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ చినికి, చినికి గాలివాన‌లా మారింది. వై.సి.పి కార్య‌క‌ర్త‌లు కొంద‌రు టి.డి.పి. మాజీ ఎంపీటీసీ స‌భ్యుడు వేణు ఇంట్లో  చొరబడి అడ్డం వచ్చిన వారిని చితకబాదారు. ఇంట్లో షర్నిచర్ ని  తగలబెట్టారు. 
 
ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణలో ఇద్ద‌రికి గాయ‌లు కాగా, వారిని అంబులెన్స్ లో హాస్పటల్ కి తరలించారు. ఈ దాడి సంఘ‌ట‌న‌లో కొన్ని బైక్ ల‌ను కూడా పెట్రోలు పోసి అగ్గి అంటించేశారు. చివ‌రిలో పోలీసులు వ‌చ్చి, ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments