Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో అల్లర్లు.. ఏ1గా చంద్రబాబు - ఏ2గా దేవినేని ఉమ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (10:33 IST)
ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికార వైకాపా నేతలు రెచ్చిపోయి టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. వీరికి పూర్తి స్థాయిలో పోలీసులు సహకరించారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో చంద్రబాబు పర్యటనలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. అంగళ్లులో జరిగిన అల్లర్లపై ముదివేడు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలపైనే పోలీసులు నమోదు చేశారు. అలాగే, పుంగనూరులో జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 74 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసి, వీరి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
 
ఈ నేపథ్యంలో తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని అంగళ్లు వీధిలో జరిగిన అల్లర్లకు సంబంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముదివేడు పోలీసుల కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్లను చేర్చారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ వీరిపై కేసులు పెట్టారు. ఐపీసీ 120బి, 147, 148, 153, 307, 115, 109, 323, 324, 505 ఆర్ డబ్ల్యూ, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
మరోవైపు, ఈ అల్లర్లకు సంబంధించి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయడాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వైకాపా నేతలు అల్లర్లకు పాల్పడితే తమపై కేసులు నమోదు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే, పోలీసులు అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలకు టీడీపీ నేతలు ధైర్యం చెబుతూ అండగా నిలబడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments