Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోసకారి వాలంటీర్ : మహిళ వేలి ముద్రతో రూ.1.70 లక్షలు స్వాహా

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (10:05 IST)
ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై ఇప్పటికే రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగినట్టుగానే వాలంటీర్ల చర్యలు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉన్న మహిళలపై లైంగికదాడులు, హత్య చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వాలంటీర్ మహిళను మోసం చేశారు. ఆమె వేలి ముద్రలతో బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.1.70 లక్షల నగదును కాజేశాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొయ్యాలగూడెంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన కొట్ర నాగమణి ఇటీవల తన బ్యాంకు ఖాతాలో రూ.13500 నగదు జమ చేసింది. ఠఆ తర్వాత తన ఖాతాలో మొత్తం ఎంత ఉందని బ్యాంకు సిబ్బందిని అడగ్గా ఇపుడు జమచేసిన మొత్తం మాత్రమే ఉందని చెప్పడంతో ఆమె నిర్ఘాంతపోయింది.
 
ఇటీవల తానెప్పూడ నగదును విత్ డ్రా చేయలేదని అధికారులకు చెప్పడంతో వారు బ్యాంకు ఖాతా వివరాలు, స్టేట్మెంట్లను పరిశీలించగా, వాలంటీర్ బండారం బయటపడింది. వేలిముద్ర ద్వారా రూ.1.70 లక్షలు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసినట్టు గుర్తించారు. వాలంటీరు తన వేలిముద్రలు తీసుకుని నగదు డ్రా చేసిన మోసం చేశారంటూ బాధితురాలు వాపోయింది. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments