Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో పేకాట ఆడుతూ చిక్కిన సీఐ - ఎస్ఐ అరెస్టు

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (08:37 IST)
కొందరు పేకాట రాయుళ్లతో కలిసి పేకాట ఆడుతున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఏఎస్ఐ‌ పోలీసులకు చిక్కారు. తిరుపతి జిల్లాలోని తిరుపతి గ్రామీణ మండలం రాఘవేంద్ర నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఇక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని దాన్ని పేకాట స్థావరంగా మార్చివేశారు. ఈ విషయం బయటకు పొక్కి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేయగా, మొత్తం 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 
 
అరెస్టు చేసిన వారిలో ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐ, ఒక ఏఎస్ఐతో పాటు మొత్తం 11 మంది ఉన్నారు. వీరి నుంచి భారీ మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిలో అధికార వైకాపాకు చెందిన నేతలు ఉన్నారు. ఈ కారణంగానే వారి అరెస్టు చేసిన వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఈ విషయం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి దృష్టికి వెళ్లింది. 
 
దీంతో అదే రోజురాత్రి పట్టణంలోని తూర్పు స్టేషన్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్న జోగారావు, కార్పొరేటర్  ఆంజనేయులు, మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో నాగరాజు, డి.సురేశ్, డి.కిరణ్ కుమార్, పి.కృష్ణారెడ్డి, బి.చెంచుముని, ఎన్.శ్రీనివాసులు, కె.మునిప్రసాద్, కె.రాధాకృష్ణ, కార్పొరేట్ కె.ఆంజనేయులు, ఎస్. నరేంద్ర, ఏఎస్ఐ జోగారావు, సీఎం చంద్రశేఖర్‌లు ఉన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ పలుకుబడితో కేసు నుంచి తప్పించుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments