Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి పోలవరం గుండెలాంటిది: కన్నా

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (08:15 IST)
ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపారని వెల్లడించారు.

ఇంతటి గొప్ప ప్రాజెక్టు పూర్తి చేయడానికి నూటికి నూరుశాతం నిధులు ఇచ్చి పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పర్యాటక కేంద్రంగా చూసిందే తప్ప.. సీరియస్‌గా ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయిందన్నారు.

ఈ నాలుగు నెలల్లో ప్రాజెక్టు పనులు ఎక్కడ వరకు వచ్చాయో చూద్దామని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నట్లు తెలిపారు. పోలవరంలో అవినీతిని నిరూపించి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో కనిపెట్టలేకపోయిందని ఎద్దేవాచేశారు. ఈనెల 13న సాయంత్రం 6 గంటలకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిసి ఒక నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. పోలవరం పురోగతి, అవినీతి ఆరోపణలపై వివరిస్తామన్నారు.

పోలవరం త్వరగా పూర్తి కావాలనేదే బీజేపీ సంకల్పమని వివరించారు. జగన్ సర్కారు పోలవరం అవినీతి బూచి చూపించి కావాల్సిన పనులు చేయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments