Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేది.. ప్రధాని

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (15:05 IST)
విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ప్రస్తుతం తెలంగాణకు చేరుకున్నారు. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ప్రజలను కలవడం సంతోషంగా వుందని మోదీ అన్నారు. విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ.. భారత్‌కు విశాఖ ఎంతో ప్రత్యేక నగరమన్నారు. 
 
విశాఖ ఓడరేవు ద్వారా వెయ్యేళ్ల క్రితం నుంచే రోమ్ వరకు వ్యాపారం జరిగేదని గుర్తు చేశారు. రూ.10,742 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులతో ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. 
 
ఏపీ ప్రజలు మంచి వారని, స్నేహ స్వభావం కలిగిన వారని ప్రధాని ప్రశంసలు గుప్పించారు. ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారని కితాబిచ్చారు. తెలుగు భాష ఉన్నతమైందని పేర్కొన్నారు. 
 
ఇకపోతే, విశాఖలో చేపల రేవును ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రతి దేశం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటోందని... సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం భారత్ వైపు చూస్తోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments