Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో (Live Video)

ఠాగూర్
బుధవారం, 8 జనవరి 2025 (17:26 IST)
విశాఖపట్టణం నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. వైజాగ్ దేశానికి తూర్పు తీర ప్రవేశద్వారంగా ఉంది. ఈ తీరానికి ప్రగతిహారాల్లో భాసిల్లే భారీ ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. వీటికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన మరోమారు ఏపీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రాల్లో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు పాల్గొంటున్నారు.
 
 
వైకాపా హయాంలో విధ్వంసానికి గురైన పారిశ్రామిక రంగానికి ఊపిరులూదేలా, ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే పలు ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రధాని మోడీ అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ కు అంకురార్పణ చేయనున్నారు. కొత్తగా రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులతో పాటు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు. 
 
చెన్నై - బెంగళూరు పారిశ్రామికవాడలో భాగంగా క్రిస్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. నవ్యాంధ్ర పురోగతికి కేంద్రం అందిస్తున్న ఈ సహకారానికి కృతజ్ఞతగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా విశాఖ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.
 
ప్రధాని నరేంద్ర నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొనే ఈ సభకు కూటమి పార్టీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
ఏపీలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలను పరిశీలిస్తే, 
 
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో 1,200 ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తారు. రూ.1.85 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇక్కడి నుంచి నిత్యం 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి, దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తారు. తదనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments