Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెను తుఫానుగా ఫణి.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం..

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:07 IST)
దక్షిణ బంగాళాఖాతంలో ఫణి తుఫాన్ స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో అది కాస్త తీవ్ర తుఫానుగా మారి, మే 1వ తేదీ సాయంత్రానికి తీవ్ర పెనుతుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఫణి తుఫాన్ చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
 
వాయువ్యదిశగా కదులుతున్న ఫణి తుఫాన్ మే 1వ తేదీకి దిశ మార్చుకునే సూచనలున్నాయి. తర్వాత ఉత్తర వాయువ్యదిశగా ఒడిశా తీరం వైపు పయనించనున్నట్లు సమాచారం అందుతోంది. దక్షిణ కోస్తాలో నేటి నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మే 3, 4 తేదీలలో ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ఓడరేవుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments