Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారు... చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నోట్ల రద్దు వల్ల ప్రజలు అందరూ ఇబ్బందులుపడ్డారు. నేను రూ.500, రూ.2000 నోట్లు రద్దు చేయమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియ

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (21:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పెట్రోల్ ధర సెంచరీ చేస్తారని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన మాట్లాడుతూ...  ''నోట్ల రద్దు వల్ల ప్రజలు అందరూ ఇబ్బందులుపడ్డారు. నేను రూ.500, రూ.2000 నోట్లు రద్దు చేయమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియోగం పెంచమని చెప్పాను. డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగితే మోసాలు తగ్గుతాయి. ఆధార్ భీమ్ యాప్ ప్రదేశపెట్టింది మనమే. క్యూఆర్ కోడ్ ఇచ్చిన మొదటి రాష్ట్రం కూడా మనదే.
 
బ్యాంకుల్లో ఫ్రాడ్ జరుగుతోంది. వాటిపై నమ్మకం పోయింది. ఎన్డీఏ వచ్చిన తరువాత గ్రోత్ ఆగిపోయింది. స్విస్ బ్యాంకుల్లో మన దేశ డబ్బుని ఏడాది లోపల తెస్తామని చెప్పారు. ఇంతవరకూ ఆ జాడే లేదు. అమరావతిలో హైకోర్టుని డిసెంబర్ నెకు సిద్ధం చేస్తాం. రాష్ట్రంలో మలేరియా తగ్గింది. ఉల్లిని నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు అందుబాటులో ఉంచుతాం. ఫైబర్ గ్రిడ్ వినూత్న ప్రాజెక్ట్. దీని కంటెంట్ అందరికి ఉపయోగపడుతోంది. క్లారిటీ ఉంది. ఇప్పటికి 4,85,000 కనెక్షన్లు ఇచ్చారు. అక్టోబరుకు 10 లక్షల కనెక్షన్లు ఇస్తారు. డిసెంబర్ నాటికి కోటి కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం.
 
ప్రభుత్వ ఆస్పత్రులలో ఉత్తమ సేవలు అందజేయడం వల్ల రోగుల సంఖ్య పెరుగుతోంది. బెడ్లు పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. సీపీఎస్ అన్ని రాష్ట్రాలలో ఉంది. పూర్తి స్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి'' అని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments