అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:23 IST)
సోషల్ ఆడిట్ జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన అనంతరం అనర్హులుగా ప్రకటించిన వారిని మరొకసారి  పూర్తిస్థాయిలో  పరిశీలించిన పిమ్మట అర్హులైతే వారికి కూడా పెన్షన్ అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) సీఈవో పి. రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అందజేస్తున్న అన్ని రకాల పెన్షన్లను  ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగా సోషల్ ఆడిట్ లో అర్హులుగా నిర్ధారణ అయిన లబ్ధిదారులకు ఈనెల పెన్షన్ మరియు వచ్చే నెల పెన్షన్ ను ఒకేసారి  అందజేయడం జరుగుతుందని సీఈవో వెల్లడించారు.

నిజమైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. పెన్షన్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పూర్తి పారదర్శకంగా పెన్షన్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.

ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ మాదిరిగా నోటీస్ బోర్డుల్లో అర్హుల జాబితాలు ప్రకటిస్తామని కావున లబ్ధిదారులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం పేదరికంను మాత్రమే కొలబద్దగా చూస్తున్నామని గుర్తుచేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలన్న తపనతోనే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్రాంతి లేకుండానే తదుపరి చిత్రం కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోచ్, నటుడు సునీల్ థాపా ఇకలేరు..

యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ తో సీతా పయనం ట్రైలర్ రిలీజ్

కన్నీరు పెట్టుకున్న చంద్రహాస్ - చేసిన తప్పును ఎక్కువ చేయకండి : ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chaddannam: మహిళలు రోజూ చద్దన్నం తీసుకుంటే ఫలితం ఏంటి?

అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం 2026

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

తర్వాతి కథనం
Show comments