Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి మద్దతివ్వను : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి కాకుండా, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (09:01 IST)
వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి కాకుండా, అభివృద్ధి చేసే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తు కొనసాగించే అంశంపై ప్రజాభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 
 
తన అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా, ఆయన మాట్లాడుతూ, తన వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని, సమయం వచ్చినపుడు ప్రకటిస్తానని తెలిపారు. కష్టాలు ఎక్కడుంటాయో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందన్నారు. అందుకే అనంతపురాన్ని దత్తత తీసుకున్నానని తెలిపారు.
 
నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తన దృష్టికి తెస్తే ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతపురం అభివృద్ధికి నీరే ప్రధానమన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. దానిపై ఉన్న ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. పరిటాల కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారంలో వాస్తవం లేదని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments