Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల పొత్తులపై ఏదో ఒక అద్భుతం జరుగుతుంది : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (17:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ, జనసేనస బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని గతంలో పవన్ స్పష్టం చేశారు కూడా. ఇపుడు మరోమారు ఆయన పొత్తులపై స్పందించారు. పొత్తులపై ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆయన చెప్పారు. 
 
జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన ఆదివారం నంద్యాల జిల్లా శిరివెళ్ళ మండలం, గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. 
 
ఆ తర్వాత ఆయనను మీడియా ప్రతినిధులు టీడీపీతో పొత్తు అవకాశాలపై ప్రశ్నించారు. పొత్తుపై టీడీపీ వైపు నుంచి ఆహ్వానం వస్తే ఎలాంటి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దీనికి పవన్ బదులిస్తూ.. బలమైన ఆలోచనా విధానంతో ముందుకు వెళతామని చెప్పారు. రాష్ట్ర ప్రజల క్షేమం, రాష్ట్ర భవిష్యత్తుకు జనసేన అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 
 
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావిస్తున్నట్టు చెప్పారు. అదేసమయంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. బీజేపీతో తమ భాగస్వామ్యం అమోఘమైన రీతిలో ఉందని, రోడ్ మ్యాప్‌కు సంబంధించిన విషయాలను తగిన  సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments