Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల శిరివెళ్ళలో పవన్ కళ్యాణ్ రచ్చబండ

pawan kalyan
, ఆదివారం, 8 మే 2022 (12:30 IST)
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఏపీలోని నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలోని శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అలాగే, నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. 
 
ఈ సందర్భంగా శిరివెళ్ళలో జరిగే కార్యక్రమంలో ఆత్మహత్యలు చేసుకున్న 130 మంది రైతు కుటుంబాలకు పవన్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. కాగా, పవన్ కళ్యాణ్ పర్యటన కోసం జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా, ఎలాంటి అలాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందు గట్టి భద్రతా ఏర్పాట్లను చేశారు. 
 
కాగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోకా యాత్ర సాగుతున్న విషయం తెల్సిందే. ఈ యాత్ర కోసం పవన్ ఆదివారం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రాయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి శిరివెళ్ళ గ్రామానికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో 10 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుడు - ఇద్దరికి గాయాలు