Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపిన్ రావత్ సేవలు శ్లాఘనీయం : పవన్ కళ్యాణ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (21:21 IST)
దేశ తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణం పట్ల జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తన సంపాన్ని తెలుపుతూ, రావత్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఈ ప్రమాదంలో రావత్ దంపతులతో సహా 13 మంది సైనికాధికారులు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ మరణం కలిచివేసిందంటూ పవన్ కళ్యాణ్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 
 
అత్యున్నత సీడీఎస్ బాధ్యతలు అందుకున్న తొలి అధికారిగా బిపిన్ రావత్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయం అని వివరించారు. త్రివిధ దళాలను సమన్వయ పరిచి దేశ రక్షణ వ్యవస్థలను పటిష్టపరిచే కీలక బాధ్యతల్లో ఉన్న రావత్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. 
 
హెలికాఫ్టర్ మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ కూడా ఉన్నారని తెలిసి చాలా బాధపడినట్టు గుర్తుచేశారు. మృతుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments