Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను తిడితే ఇసుక కొరత తీరదు.. ఎన్ని అన్నా నా ఒళ్లు చావదు : పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (08:57 IST)
వ్యక్తిగతగా తనను లక్ష్యంగా చేసుకుని తిడితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరత తీరదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ఆయన సారథ్యంలో జరిగిన లాంగ్ మార్చ్‌పై వైకాపా నేతలు విమర్శలు చేసిన విషయం తెల్సిందే. 
 
వీటికి పవన్ కౌంటరిచ్చారు. 'విశాఖపట్నంలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తే.. ఊహించనంత మంది వచ్చారు. అంటే సమస్య అంత తీవ్రంగా ఉందని అర్థం. దానిని ముందు పరిష్కరించడానికి జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించాలి. నన్ను తిడితే లాభం లేదు.. ఎన్ని అన్నా నా ఒళ్లు చావదు' అని అన్నారు. 
 
సమస్యను పరిష్కరించకుండా తనను తిడితే వైసీసీ నాయకులే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని తేల్చిచెప్పారు. వారు ఇసుకలో ఇంకేదో బెనిఫిట్‌ వెదుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక లభించక భవన నిర్మాణ కార్మికులు ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారికంగా పది మంది వరకు చనిపోగా.. అనధికారికంగా 50 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
సమస్యపై ఇంతమంది గళమెత్తి రోడ్ల మీదకు వస్తే.. ప్రజల్లో ఆగ్రహావేశాలు రెచ్చగొడుతున్నానని ఆరోపించడం తగదు. 151 సీట్లు గెలుపొందిన పార్టీ వైసీపీ ఈ ఐదు నెలల్లో సుపరిపాలన అందిస్తే జనసేన మీటింగ్‌కు అంత మంది ఎందుకు వస్తారో ఆలోచించాలి అని అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments