Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:50 IST)
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల్లో మొద‌టిరోజు గురువారం పవిత్ర ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేపట్టారు.

ఆ తరువాత కంక‌ణ‌బ‌ట్టార్ వేంప‌ల్లి శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వ‌ర్యంలో ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహనం, చక్రాదిమండల పూజ, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ఠ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. మధ్యాహ్నం పద్మావతి అమ్మవారికి స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

ఈ కారణంగా తిరుప్పావ‌డ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ రద్దయ్యాయి. కాగా, ఈ నెల 13న పవిత్ర సమర్పణ, 14న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750 చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.

గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమ‌తిగా అందజేస్తారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ కోలా శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments