Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు...

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (12:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నర్సాపురం - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై అడ్డుగా ఉన్న రైలు పట్టాలపై ముక్కను ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఇనుపముక్కం ఎగిరి పక్కన పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. ట్రాక్‌పై రైలు పట్టా ముక్కను ఎవరు పెట్టారన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున కావలి - బిట్రగుంట స్టేషన్ల మధ్యలో ముసునూరు వద్ద రైల్వే ట్రాక్‌పై దుండగులు రైలు పట్టాను పెట్టారు. దాదాపు రెండు మీటర్ల పొడవైన రైలు పట్టాను ట్రాక్‌కు అడ్డంగా పెట్టారు. అదే ట్రాక్‌పై నర్సాపూర్ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చింది.
 
రైలు పట్టాను ఢీ కొట్టగా.. ఆ వేగానికి రైలు పట్టా దూరంగా ఎగిరిపడింది. ఇలా ఎగిరి పక్కన పడడం వల్లే ప్రమాదం తప్పిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాను ట్రాక్‌పై పెట్టిన దుండగులను పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments