Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

ఠాగూర్
శుక్రవారం, 22 నవంబరు 2024 (17:00 IST)
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే పరిటాల సునీత రెండో రోజు ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబుతో పాటు పలువురు మంత్రులను కలిశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆమె శుక్రవారం మంత్రులు నారా లోకేష్, అచ్చన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీని కలిశారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి వివరించారు. 
 
గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాల పేరుతో ప్రకాష్ రెడ్డికి సంబంధించిన రాక్రీట్ సంస్థ చేసిన దోపిడీ, పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపు, భూ అక్రమాలు వంటి వాటి గురించి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఖచ్చితంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడుని కలిసి రైతు సమస్యలపై విజ్ఞప్తి చేశారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా 90 శాతం సబ్సిడీ డ్రిప్ మంజూరు చేయాలన్నారు. 
 
కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సబ్సిడీలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో తెలుగు దేశం పార్టీ సానుభూతిపరుల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించారని.. నేటికీ అవి పునరుద్దరించలేదన్నారు. దీని వలన చాలా మంది పార్టీ సానుభూతి పరులు నష్టపోతున్నారన్నారు. కొత్త పథకాలకు కూడా అర్హత కోల్పోతున్నారని వివరించారు. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలిసి ఆత్మకూరు, అనంతపురం రూరల్ తహసీల్దార్ కార్యాలయాలకు భవనాలు మంజూరు చేయాలన్నారు. 
 
డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఓఎస్డీని కలిశారు. పండమేరు బ్రిడ్జి నిర్మాణానికి 1.8 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పలు గ్రామాలకు రోడ్లు మంజూరు, పెండింగులో ఉన్న త్రాగునీటి పథకాల అంశాల గురించి వివరించారు. వీటిన్నింటిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments