Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (19:02 IST)
విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తగినంత బోధనా సిబ్బంది లేక విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండలం, మల్లారంలో ఈ సీన్ చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు పేరెంట్స్ తాళాలు వేశారు. 
 
మల్లారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా ఒక టీచర్ ఆరు సంవత్సరాల క్రితం డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. సదరు టీచర్ హైదరాబాద్‌లో ఉంటూ మల్లారం గ్రామంలోని పాఠశాలలో టీచర్‌గా జీతం పొందుతుండడం గమనార్హం.
 
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ పిల్లల భవిష్యత్తు మారుతుందని ఎంతో ఆశ పడ్డామని కానీ టీచర్ల కొరతతో అసలుకే మోసం వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. 
 
విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు వస్తున్నా.. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments