Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుకొట్టి చిందేసిన ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసు

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (11:38 IST)
వైకాపా నేతలతో కలిసి మందేసి చిందేసిన ఎమ్మార్వోకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తేరుకోలేని షాకిచ్చారు. వైకాపా నేతల మందు పార్టీలో పాల్గొన్నందుకుగాను వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసును జారీచేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా భామిని ఎమ్మార్వోగా నరసింహమూర్తి ఉన్నారు. ఇటీవల వైకాపా నేతలంతా కలిసి ఓ తోటలో పెట్టుకున్న మందుపార్టీలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఈయనతో పాటు ఉద్యోగులతో మందు పార్టీ చేసుకుని ఆ తర్వాత వైసీపీ నేతలతో కలసి డ్యాన్స్ చేశారు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో నరసింహమూర్తికి పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన శాఖాపరమైన విచారణ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments