Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాకులు చెప్పకుండా ఈసారైనా ఓటు హక్కు కల్పిస్తారా? లేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (09:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు కోసం నానాపాట్లు పడుతున్నారు. గతంలో లోపభూయిష్ట విచారణ కారణంగా తాను దుగ్గిరాలలో ఓటు హక్కు పొందలేకపోయానని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం దుగ్గిరాలలో ఉంటున్నారు. ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా శనివారం తన ఇంటికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) వద్ద ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఆయన దుగ్గిరాలలో ఉండటం లేదంటూ ఓటు హక్కు ఇవ్వకుండా తిరస్కరించిన సంగతి తెలిసిందే. 
 
తాను హైదరాబాద్‌లో ఉన్నా తన ఓటును 2020లోనే సరెండర్‌ చేశానని చెప్పారు. అప్పుడే దానికి సంబంధించిన అన్ని రుజువులు ఇస్తూ దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేశానని తెలిపారు. అయినా తాను స్థానికంగా ఉండటం లేదనే సాంకేతిక కారణాన్ని చూపి ఓటు హక్కు నిరాకరించారని పేర్కొన్నారు. 
 
ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు పూర్తి చేసుకున్నాక ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నట్లు చెప్పారు. ఇక్కడే తాను పుట్టి, చదువుకున్నానని, తన తల్లి కూడా ఇక్కడే ఉంటారన్నారు. దుగ్గిరాలలో ఓటు హక్కు ఇవ్వకుండా నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్లినప్పుడు అన్ని ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించడంతో తాజాగా దరఖాస్తు సమర్పించానని చెప్పారు. ఈ దఫా అయినా కుంటి సాకులు చెప్పకుండా ఓటు హక్కును కల్పిస్తారా? లేదా? అని ఆయన బీఎల్వీవో అధికారిని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments