Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి... భార్యాపిల్లలను చంపేసి మచిలీపట్నం టెక్కీ ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (09:38 IST)
సంపాదించిన సొమ్మంతా షేర్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి తీవ్రంగా నష్టపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన భార్యాపిల్లను హత్య చేసిన ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని మచిలీపట్నంకు చెందిన టెక్కీగా గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మచిలీపట్నానికి చెందిన విజయ్ (31) అనే వ్యక్తి టెక్కీగా పనిచేస్తున్నారు. ఈయన తన భార్య హైమావతి (29), ఇద్దరు కుమార్తెలతో కలిసి సిగేహళ్లిలోని ఓ అపార్టుమెంటులో నివసించేవారు. జూలై 31వ తేదీన వారందరూ విగతజీవులుగా మారడం స్థానికంగా కలకలం కృష్టించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
 
విజయ్ షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన డబ్బంతా పోగొట్టుకోవడం వల్ల ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అతను తన భార్య, యేడాదిన్నర, ఆరు నెలల వయసున్న ఇద్దరు కూతుళ్లు హత్య చేసి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని బెంగుళూరు డీసీపీ వెల్లడించారు. కుటుంబ సభ్యులను గొంతు నులిమి హత్య చేసినట్టు ఫోరెన్సిక్ నిపుణులు అంచనాలను వచ్చారని పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో శనివారం మచిలీపట్నంలో వారి అత్యంక్రియలు జరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments