Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలి- టీడీపీ సభ్యులు

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (12:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్‌లో పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆర్టీసి టికెట్ ధరలు పెంచడంతో ప్రజలపై 1000కోట్ల రూపాయలు భారం పడుతోందని కావున పెంచిన ధరలను వెంటనే రుద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
దానిపై రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు మరియు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జోక్యం చేసుకుని ఆర్టీసీ చార్జీలు పెంచడానికి గల కారణాలు పై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కావున సభ్యులు నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఆర్టీసీ చార్జీలు పెంచడానికి కారణాలతో పాటు ఆర్టీసీని అప్పుల్లో కి నెట్టిన వారెవరూ కూడా వివరంగా చర్చిద్దామని అన్నారు.
 
ముందుగా పెంచిన చార్జీలు తగ్గించాలని ఆతర్వాత ఆర్టీసీకి సంబంధించిన అంశాలు చర్చిద్దామని టిడిపి సభ్యులు పట్టుబట్టి వారి నిరసనను కొనసాగించారు. ఈ దేశంలో శాసన మండలి అధ్యక్షులు మహ్మద్ అహ్మద్ షరీఫ్ జోక్యం చేసుకుని సభా సాంప్రదాయాలు పాటిస్తూ వెంటనే సభ్యులు నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు.అయినప్పటికీ టిడిపి సభ్యులు నిరసనను కొనసాగించడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments