Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయ పోరాటంతో వైసీపీ అన్యాయాలను ఎదుర్కొంటాం...

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (18:54 IST)
నెల్లూరు జిల్లా వెంకటాచలంలో వైసీపీ కక్షసాధింపు రాజకీయాలకు బాధితుడైన మైనార్టీ నాయకుడు పఠాన్ ఖయ్యూమ్ ఖాన్ కు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ధైర్యం చెప్పారు. నెల్లూరు పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడికి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటాచలం సెంటర్ లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇటీవల వైసీపీ నేతల కక్ష సాధింపులో భాగంగా అధికారులు కూల్చివేసిన ఖయ్యూమ్ ఖాన్ కు చెందిన దుకాణాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. 

 
అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా చేపట్టిన దిష్టిబొమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారని కక్షకట్టి ఖయ్యూమ్ ఖాన్ దుకాణాన్ని రాత్రికి రాత్రి అధికారులతో కూల్చివేయించారని సోమిరెడ్డి చంద్ర‌బాబుకు వివరించారు. 
 

ఖయ్యూమ్ ఖాను కు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు న్యాయపోరాటానికి అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు  భరోసా ఇచ్చారు. ప్రజలతో పాటు ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదని, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని  టీడీపీ అధినేత దైర్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments