Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా మారిన జగన్ బంధువు... ఎవరు?

ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (15:54 IST)
ఒంగోలు మాజీ ఎంపీ, వైకాపా సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకి చెందిన వరికూటి అశోక్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి కొండపిలోని సాయి సీతారామ కల్యాణ మండపంలో జరిగిన వరికూటి అనుకూల వర్గీయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భాషలో చెప్పాలంటే పొగాకు చెట్టుకు చేటు చేసే పొగమల్లెలా వైవీ సుబ్బారెడ్డి తయారయ్యారంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
 
ప్రకాశం జిల్లాలో వైకాపా అనేదిలేకుండా చేయడానికి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఉన్న అస్తులు కరిగిపోయాయి... ఇప్పుడు మీకు నేను నాయకుడిగా పనికిరాలేదా... మీకు బానిసలు కావాలని ఇన్‌చార్జి పదవి వేరొకరికి ఇస్తారా? ఇది సమంజసమా? అంటూ నిలదీశారు. 
 
ముఖ్యంగా, అప్పుతెచ్చానో? ఉన్నదే కాజేసుకున్నానో నాలుగు కోట్లు పార్టీ కోసం వెచ్చించాను అంటూ వాపోయారు. దళితుల రక్తమాంసాల మీద ఎంపీ కోట కట్టుకుంటారా? ఒక్క దళితులకే కాదు, బీసీలకు అన్యాయం చేస్తావా? అంటూ వైవీనిని అశోక్ బాబు దునుమాడారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments