Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు చెల్లిస్తానని ఇంటికి పిలిచి మహిళపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (09:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలులో ఓ దారుణం జరిగింది. అప్పు చెల్లిస్తానని నమ్మబలికి మహిళను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఓ కానిస్టేబుల్. ఈ కామాంధుడైన కానిస్టేబుల్‌కు మరో ఇద్దరు మిత్రులు కూడా తనవంతు సహకారం అందించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెంకట రాజేష్‌ అనే కానిస్టేబుల్‌ ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్నాడు. ఒంగోలు దిబ్బల రోడ్డుకు చెందిన ఓ మహిళతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె వద్ద కానిస్టేబుల్ రూ.35 లక్షలను అప్పుగా తీసుకున్నాడు. 
 
అదేక్రమంలో ఆమెతో సన్నిహితంగా మెలుగుతూనే, ఆమెకు తెలియకుండానే నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. డబ్బులు చెల్లించమని కోరితే ఆ చిత్రాలు చూపించి బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 8న అప్పు చెల్లిస్తానని తన స్నేహితుడు విశ్రాంత సైనికోద్యోగి నల్లూరి సుధాకర్‌ ఇంటికి మహిళను పిలిచాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు సుధాకర్‌ను రాజేశ్‌ ప్రేరేపించాడు. బాధితురాలు తప్పించుకొని వెళ్లగా సుధాకర్‌, వీరి స్నేహితుడు దొంగా హరి బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments