ఒమిక్రాన్ వైరస్ భయం : కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిన ఏపీ సర్కారు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:22 IST)
ఇపుడు ప్రపంచ ప్రజలకు ఒమిక్రాన్ వైరస్ భయం పట్టుకుంది. ఈ వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. కొత్త ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కేంద్ర హోం శాఖతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, మాస్కులు లేని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగమాల్లోకి అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
అలాగే, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సదరు వ్యాపార, వాణిజ్యం సంస్థలను రెండు రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఉద్దేశపూర్వకంగా రూల్స్ అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments