Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్ భయం : కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిన ఏపీ సర్కారు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:22 IST)
ఇపుడు ప్రపంచ ప్రజలకు ఒమిక్రాన్ వైరస్ భయం పట్టుకుంది. ఈ వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. కొత్త ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కేంద్ర హోం శాఖతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, మాస్కులు లేని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగమాల్లోకి అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
అలాగే, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సదరు వ్యాపార, వాణిజ్యం సంస్థలను రెండు రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఉద్దేశపూర్వకంగా రూల్స్ అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments