Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్ భయం : కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిన ఏపీ సర్కారు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:22 IST)
ఇపుడు ప్రపంచ ప్రజలకు ఒమిక్రాన్ వైరస్ భయం పట్టుకుంది. ఈ వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. కొత్త ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కేంద్ర హోం శాఖతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, మాస్కులు లేని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగమాల్లోకి అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
అలాగే, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సదరు వ్యాపార, వాణిజ్యం సంస్థలను రెండు రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఉద్దేశపూర్వకంగా రూల్స్ అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments