Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా క్వారంటైన్ సెంటర్‌లలోనూ మహిళలను వదలని కామాంధులు

Webdunia
గురువారం, 21 మే 2020 (20:53 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా సోకి హాస్పిటల్‌లలో క్వారంటైన్ కోసం చేరిన వారికి కామంతో కళ్లుమూసుకుపోయాయి. వివరాలలోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళను కొంతమంది దుర్మార్గులు వేధింపులకు గురిచేసారు. కరోనా పాజిటివ్ రోగితో కాంటాక్ట్ నేపథ్యంలో కుమేరియా భటోలి గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో అధికారులు ఓ మహిళను క్వారంటైన్‌లో ఉంచారు.
 
ఆమెపై కన్నేసిన ఇద్దరు కామాంధులు, ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను చూపించి, సదరు మహిళను లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా, ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే ఈ వీడియోని సామాజిక మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ భయంతో పోలీసులను ఆశ్రయించింది. 
 
పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు, అయితే అప్పటికే ఆ కామాంధులు వారి వద్ద ఉన్న వీడియోను డిలీట్ చేయడంతో, పోలీసులు మహిళ దగ్గర ఉన్న వీడియో ఆధారంగా, బాధితురాలికి వారు పంపిన సందేశాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసారు. క్వారంటైన్ సెంటర్‌లో సైతం మహిళను లైంగికంగా వేధించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం