Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోలో అసభ్యంగా డ్రైవర్, దిశ సమాచారంతో నిమిషాల్లో కాపాడిన పోలీసులు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (17:17 IST)
ఆపదలో ఉన్న యువతిని దిశ యాప్ ద్వారా సమాచారం రావడంతో నిమిషాల వ్యవధిలో రక్షించారు పోలీసులు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు నేరాలను ఒకే ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశ యాప్ డెవలప్ చేసింది ఎపి ప్రభుత్వం. ఇప్పుడది సత్ఫలితాలను ఇస్తోంది.
 
సూళ్ళూరుపేట సమీపంలోని శ్రీసిటీలో పనిచేస్తున్న ఒక యువతి మార్కాపురం వెళ్ళింది. నాయుడు పేట నుంచి సూళ్ళూరుపేట వెళ్ళేందుకు రాత్రి సమయంలో ఆటో ఎక్కింది. అయితే ఆటోలో ఎక్కిన కొద్దిసేపటికే డ్రైవర్ మాటతీరు, పద్ధతిపై అనుమానం వచ్చింది. ఏ మాత్రం ఆలోచించకుండా దిశ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్‌ను ఆన్ చేసింది. బాధిత యువతి ఎస్ ఓఎస్ బటన్ ఆన్ చేయగానే వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది.
 
రాత్రి 10.30 నిమిషాలకు సమాచారం అందుకున్న పోలీసులు 10.40 నిమిషాలకు బాధిత యువతితో  ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారి సత్రం పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది 10.42 నిమిషాలకు యువతి దగ్గరకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆటో డ్రైవర్ పరారయ్యాడు.
 
యువతిని సేఫ్ చేసిన పోలీసులు తరువాత ఆమె పనిచేసే ప్రాంతంలో వదిలిపెట్టారు. బాధిత యువతి చాలా అప్రమత్తంగా వ్యవహరించిందన్నారు పోలీసులు. ముందస్తు ఎస్ఓఎస్ బటన్ నొక్కడంతో పాటు తన సోదరికి కూడా కాల్ చేసి చెప్పిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments