ఆటోలో అసభ్యంగా డ్రైవర్, దిశ సమాచారంతో నిమిషాల్లో కాపాడిన పోలీసులు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (17:17 IST)
ఆపదలో ఉన్న యువతిని దిశ యాప్ ద్వారా సమాచారం రావడంతో నిమిషాల వ్యవధిలో రక్షించారు పోలీసులు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు నేరాలను ఒకే ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశ యాప్ డెవలప్ చేసింది ఎపి ప్రభుత్వం. ఇప్పుడది సత్ఫలితాలను ఇస్తోంది.
 
సూళ్ళూరుపేట సమీపంలోని శ్రీసిటీలో పనిచేస్తున్న ఒక యువతి మార్కాపురం వెళ్ళింది. నాయుడు పేట నుంచి సూళ్ళూరుపేట వెళ్ళేందుకు రాత్రి సమయంలో ఆటో ఎక్కింది. అయితే ఆటోలో ఎక్కిన కొద్దిసేపటికే డ్రైవర్ మాటతీరు, పద్ధతిపై అనుమానం వచ్చింది. ఏ మాత్రం ఆలోచించకుండా దిశ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్‌ను ఆన్ చేసింది. బాధిత యువతి ఎస్ ఓఎస్ బటన్ ఆన్ చేయగానే వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది.
 
రాత్రి 10.30 నిమిషాలకు సమాచారం అందుకున్న పోలీసులు 10.40 నిమిషాలకు బాధిత యువతితో  ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారి సత్రం పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది 10.42 నిమిషాలకు యువతి దగ్గరకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆటో డ్రైవర్ పరారయ్యాడు.
 
యువతిని సేఫ్ చేసిన పోలీసులు తరువాత ఆమె పనిచేసే ప్రాంతంలో వదిలిపెట్టారు. బాధిత యువతి చాలా అప్రమత్తంగా వ్యవహరించిందన్నారు పోలీసులు. ముందస్తు ఎస్ఓఎస్ బటన్ నొక్కడంతో పాటు తన సోదరికి కూడా కాల్ చేసి చెప్పిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments