Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌రిటాల‌లో ఎన్టీయార్ విగ్ర‌హం చేయి విర‌గొట్టారు...

Webdunia
బుధవారం, 7 జులై 2021 (17:44 IST)
కృష్ణాజిల్లా కంచికచర్ల మండ‌లం పరిటాలలో ఎన్టీ రామారావు విగ్రహం చేయిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు  విరగకొట్టారు. దీనితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప‌రిశీలించారు. 
 
నేషనల్ హైవే పక్కన స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయ‌డానికి దుండగులకు ఎంత ధైర్యం? అని దేవినేని ప్ర‌శ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత త‌మ‌ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టడం చంపడం చేస్తున్నార‌ని ఆరోపించారు.

మొదట్లోనే వారి మీద కేసులు పెట్టి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదా ? అని ప్ర‌శ్నించారు. నందిగామ జెండా దిమ్మ పగలగొట్టిన వారిపై ఎంత మంది పైన కేసులు పెట్టారు .. ఏమి చర్యలు తీసుకున్నారు? అని ప్ర‌శ్నించారు. 
 
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజాప్రసాదం నుంచి బయటకు రాడు... ఒక పక్క కృష్ణ జలాలు నీటి వివాదం.. మీ చేతిలో 28 మంది ఎంపీలు ఉండీ ఉపయోగం ఏమిటి? మీరు కోటలో ఉంటే, ఏమిటి పేటలో ఉంటే ఏమిటి! నారుమళ్లకు నీళ్లు ఇవ్వలేరు కానీ, విగ్రహాలు మాత్రం పగలగొడతారు ఈ దద్దమ్మలు... అని ఎద్దేవా చేశారు దేవినేని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments