Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య ఘర్షణం - కొడుకుతో కలిసి రైలుకు ఎదురుగా నిలబడి భర్త...

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (10:11 IST)
పచ్చని సంసారంలో మనస్పర్థలు చిచ్చురేపాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి గొడవలు చివరకు రెండు ప్రాణాలను బలితీసుకున్నాయి. అప్పటికే కుమార్తె చనిపోవడం, భార్యతో ఘర్షణ వంటి అంశాలు ఆ వ్యక్తిని తీవ్రంగా కుంగదీశాయి. దీంతో తన రక్తం పంచుకుని బిడ్డ ఆనవాలు కూడా కట్టుకున్న భార్య వద్ద ఉండకూడదని భావించాడు. కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని మైలవరం చిన రామాలయం ప్రాంతానికి చెందిన రామారావు అనే వ్యక్తి బీఎడ్ పూర్తి చేసి రేషన్ షాపులో డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు తొమ్మిదేళ్ల క్రితం దుర్గ అనే మహిళతో వివాహం కాగా, కుమారుడు గోపీనంద్, కుమార్తె మహాలక్ష్మిలు ఉన్నారు. 
 
అయితే, యేడాది క్రితం కుమార్తె మహాలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో రామారావు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో భార్య దుర్గతో విభేదాలు పొడచూపాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో పచ్చని సంసారంలో చిచ్చు రేపాయి. ఇవి ఆయన్ను మరింతగా కుంగదీశాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుడిని తీసుకుని రేమిడిచర్ల రైల్వే గేట్ వద్దకు వెళ్లాడు. 
 
అక్కడ బైకును పార్క్ చేసి ట్రాక్‌పై వేగంగా వస్తున్న గూడ్సు రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. రైలు ఢీకొనడంతో తండ్రీకుమారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. స్థానిక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments