Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి భూములు అయిపోయాయి, దేవదాయశాఖ భూములపై పడ్డారు?

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (22:38 IST)
తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తిభావంతో సమర్పించే భూములను అమ్మేందుకు టిటిడి ప్రయత్నిస్తోందని సోషల్ మీడియాలోను, ప్రసార మాధ్యమాల్లోను పెద్దఎత్తున రావడంతో టిటిడి వెనక్కి తగ్గింది. భూముల అమ్మకూడదని నిర్ణయం తీసేసుకుంది. ఒక తీర్మానం కూడా చేసేసింది.
 
దీనిపై హిందూ ధార్మిక సంఘాల్లోను, బిజెపి నాయకుల్లోను సంతోషం వ్యక్తమైంది. కానీ ఆ తరువాత దేవదాయశాఖ భూములపై పోరాటం చేసేందుకు బిజెపి, హిందూ ధార్మిక సంఘాలు ప్రయత్నం ప్రారంభించాయి. దేవదాయశాఖకు చెందిన భూములు ఎపిలో ఎక్కడెక్కడ ఉన్నా సరే వాటిని పరిరక్షించాలని, ఆ భూములను ప్రభుత్వం అమ్మకుండా చట్టం తీసుకురావాలన్నది హిందూ ధార్మిక సంఘాల డిమాండ్.
 
ఇదే విషయంపై పోరాటం చేసేందుకు సిద్థమవుతున్నాయి హిందూ ధార్మిక సంఘాలు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం కూడా అందజేసిన హిందూ ధార్మిక సంఘాలు దేవదాయశాఖా మంత్రి వెంటనే స్పందించకుంటే మాత్రం కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయం తీసేసుకున్నారు.
 
ఎపిలో దేవదాయశాఖకు చెందిన భూములు ఎన్నో ఉన్నాయని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే కబ్జా చేసిన భూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని తిరిగి దేవదాయశాఖకు చెందేలా చర్యలు తీసుకోవాలన్నది హిందూ ధార్మిక సంఘాల డిమాండ్. ఈ పోరాటమే ప్రారంభమైతే ఎపిలో మరో వారంరోజుల పాటు ఇదే హాట్ టాపిక్‌గా మారే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments