Webdunia - Bharat's app for daily news and videos

Install App

Roja: తప్పు మీది కాదు.. ఈవీఎంలదే.. కూటమి సర్కారుపై సెటైర్లు విసిరిన ఆర్కే రోజా

సెల్వి
సోమవారం, 17 మార్చి 2025 (21:57 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత రోజా అధికార సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే వైద్య కళాశాలల స్థాపనను నిలిపివేసిందని, రైతు భరోసా కేంద్రాలను మూసివేస్తోందని, ఇప్పుడు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆమె ఆరోపించారు.
 
పాఠశాలలు మూసేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "విద్య ప్రభుత్వ బాధ్యత కాదని మీరు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి, ఇది మీ తప్పు కాదు, నిజమైన నింద ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు)పై ఉంది" అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
 
గ్రామాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒకే పాఠశాల ఉండాలనుకోవడం ఏ విధమైన విధానం అంటూ నిలదీశారు.గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా పెట్టుకోవచ్చు.కానీ పిల్లలకు చదువు చెప్పే పాఠశాల మాత్రం ఒకటే ఉండాలంటారా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments