Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాలకు డబ్బుల్లేవ్.. ఎర్రచందనం అమ్మేద్దాం: జగన్

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:49 IST)
ప్రభుత్వ ఆదాయ వనరులపై అధికారులు దృష్టి పెట్టాలని సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయ వనరుల పెంపుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. దీనికోసం ప్రజలపై భారం వేయకుండా ఆదాయ వనరులను పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఎపిఎండిసి టెండర్ల ద్వారా దక్కించుకున్న ఝార్ఖండ్‌ బ్రహ్మదిహ కోల్‌మైన్‌, మధ్యప్రదేశ్‌లోని సులియారీ, చత్తీస్‌ఘడ్‌లోని మదన్‌పూర్‌ సౌత్‌ బగ్గుల నిర్వహణ, మైనింగ్‌ కార్యకలాపాలను నిర్ణీత గడువులోగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సిఎం ఆదేశించారు.

రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్‌ కార్యకలాపాలపై మరింత ఫోకస్‌ పెట్టాలని చెప్పారు. సిలికా శాండ్‌కు సంబంధించి ఎపిఐఐసితో సమన్వయం చేసుకుని వెంటనే కార్యకలాపాలు వేగవంతం చేయాలని తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వెంటనే తీసుకొచ్చేలా ప్రయత్నించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

దీనిపై యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే అంశాలపై అధికారులు మరింత ఫోకస్‌తో పనిచేయాలని, వీటిపై నిరంతరం సమీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments