Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా - ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ మిగిలిపోతారు... షర్మిల

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (17:28 IST)
కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ ప్లాంట్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నారని ఆమె మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె హైదరాబాద్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ, కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు, మేనకోడలుగా ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డివంటి వారిని అడ్డం పెట్టుకుని తనపై నిందలు వేశారని విమర్శించారు. జగన్‌కు ఆత్మీయులకంటే ఆస్తులే ముఖ్యమనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో లేదో వైకాపా నేతలు ఆలోచించాలని చెప్పారు. 
 
జగన్ ద్వంద్వ వైఖరి మరోమారి బయటపడిందని షర్మిల అన్నారు. వక్ఫ్ బిల్లులో డబుల్ స్టాండర్డ్ చూపించారని విమర్శించారు. ఎన్డీయేకు బలం ఉన్న లోక్‌సభలో బిల్లును వ్యతిరేకించి, కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేశారని మండిపడ్డారు. జగన్ సూచనలతో రాజ్యసభలో వైకాపా ఎంపీలు బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. జగన్ తీరును జాతీయ మీడియా బట్టబయలు చేస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments