Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

Advertiesment
radhika - vikas - bablue

ఠాగూర్

, మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (18:22 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ ప్రేమకథలో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. తన భార్యను భర్త ఆమె ప్రియుడుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత వధూవరులిద్దరూ వారి ఇంటికి వెళ్లారు. అయితే, కోడలిని రెండో భర్త అమ్మ (అత్తగారు) మొదటి భర్త దగ్గరికి తిప్పి పంపించింది. అలాగే, తన వద్దకు వచ్చిన భార్యను మొదట భర్త మళ్లీ అక్కున చేర్చుకున్నాడు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో ఇటీవల ఓ షాకింగ్ ప్రేమకథ జరిగిన విషయం తెల్సిందే. తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో మొదటి భర్త బబ్లూ దగ్గరుండి పెళ్లి చేశాడు. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందన్న భయంతోనే తన భార్యను ఆమె ప్రియుడుకిచ్చి వివాహం జరిపించినట్టు బబ్లూ చెప్పాడు. 
 
అయితే, తన ఇంటికి వచ్చిన కోడలు రాధికకు అత్త అయిన వికాస్ తల్లి తేరుకోలేని షాకిచ్చింది. రాధికను తిరిగి ఆమె మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. రాధికకు రెండో పెళ్లి చేశాక, తన వల్ల ఆమెకు కలిగిన ఇద్దరు పిల్లల పెంపకం బాధ్యతలను బబ్లూయే తీసుకున్న విషయంతెల్సిందే. పైగా, వివాహమైన వెంటనే రాధిక తన పిల్లలతో పాటు భర్తను వదిలివేసి రెండో భర్త వికాస్‍‌తో వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో విసాస్ తల్లి కీలక నిర్ణయం తీసుకుంది రాధిక భర్త బబ్లూ, అతడి పిల్లల మానసికక్షోభ గురించి ఆలోచి నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరకు వెళ్లాలని రాధికను ఒత్తిడి చేశాను. దీంతో ఆమె మొదటి భర్త వద్దకు వెళ్లింది" అని వికాస్ తల్లి చెప్పింది. కాగా, తన వద్దకు వచ్చిన రాధికను మొదటి భర్త బబ్లూ మళ్లీ స్వీకరించాడు. భవిష్యత్‌లో రాధికకు ఏమైనా ప్రమాదం జరిగితే దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇపుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!