Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ రవాణా!

Webdunia
శనివారం, 1 మే 2021 (11:23 IST)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాడుతున్న లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ట్యాంకర్లను ఆక్సిజన్ రవాణాకు వాడేటట్లు మార్పులు చేశారు. ప్రస్తుతం 9 ట్యాంకర్లలో రెండు ఏపీకి ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని కోవిడ్ స్పెషలాఫీసర్ ఎంటి కృష్ణబాబు వివరించారు. 
 
రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో అధికారులు సిద్ధమవుతున్నారు. ఒరిస్సాలోని అంగూల్ నుండి ఆక్సిజన్ రవాణాకు ఎయిర్ఫోర్స్ 2 ట్యాంకర్లను విజయవాడ లేదా తిరుపతి నుండి వాయు మార్గాన భువనేశ్వర్ కి చేర్చడానికి ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 
 
కేంద్రం ప్రభుత్వం దిగుమతి చేసుకునే ఐఎస్ఓ కంటైనర్ ట్యాంకర్‌లలో కూడా రాష్ట్రానికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ ట్యాంకును ఆసుపత్రిలో 17 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నెలకొల్పేందుకు అవకాశం ఉందని, ఒక వారం లోపు మరో రెండు ఆక్సిజన్ ట్యాంకులను మన సర్క్యూట్‌లో పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments