Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలు వాయిదా వేశా... టార్గెట్ చేశారు : నిమ్మగడ్డ

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (12:40 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడమే తాను చేసిన తప్పు అని ఏపీ మాజీ ష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. తనను అడ్డదారిన తెచ్చిన ఆర్డినెన్స్ ద్వారా పదవీచ్యుతుడిని చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన రాష్ట్ర హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇందులో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. 
 
తాను నిష్పక్షపాతంగా పని చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, వైసీపీ నేతలపై ఫిర్యాదులు రాగా, తాను నివేదికలు కోరడమే తప్పైందని వాపోయారు. తాను స్థానిక ఎన్నికలను వాయిదా వేయకుంటే, ఏపీ ఈపాటికి కరోనా హాట్‌స్పాట్‌గా మారి ఉండేదని, అయితే, ఎన్నికలు వాయిదా వేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి, తనకు మధ్య ఘర్షణ జరిగిందన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, సర్వీస్ నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను నిలుపుదల చేయాలని ఆయన తన అత్యవసర పిటిషన్‌లో కోరారు. ముఖ్యంగా, అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్‌లను తేవాలని, అది కూడా న్యాయ సమీక్షకు లోబడివుండాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, ఏపీలో అలాంటి పరిస్థితి లేకున్నా, తనను తప్పించాలన్న ఉద్దేశంతోనే జీవో తెచ్చారని ఆయన ఆరోపించారు. 
 
ఆర్డినెన్స్‌ల జారీలో అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే, కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తన పిటిషన్‌లో గుర్తు చేసిన నిమ్మగడ్డ, సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేయడం తన తప్పయిపోందన్నారు. రాష్ట్రాల పరిధిలో ఎన్నికల కమిషనర్ తొలగింపునకు రాజ్యాంగంలోని నిర్దేశిత విధానాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆరోపించారు.
 
ఇదిలావుంటే, ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ, ఆర్డినెన్స్ తేవడం, ఆ వెంటనే నిమ్మగడ్డను తొలగించి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజును ఆ పదవిలో నియమించడాన్ని సవాల్ చేస్తూ, ప్రకాశం జిల్లా న్యాయవాది తాండవ యోగేశ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాటినన్నింటిపై సోమవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

మంగ్లీ డ్రగ్ పార్టీలో మేం లేవంటున్న రచ్చ రవి, దివి వాద్య, కాసర్ల శ్యామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments