Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదు... ఎందుకు?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:14 IST)
హైదరాబాద్ నగరంలో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదైంది. ఈ కేసును నమోదు చేసింది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ కావడం గమనార్హం. ఈ తరహా కేసు నమోదు కావడం హైదరాబాద్ నగరంలో ఇదే తొలిసారి. ఈ తరహా కేసును ఎందుకు నమోదు చేయాల్సివచ్చిందో తెలుసుకుందాం. 
 
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యూసుఫ్ ఖాన్ - బేగం అనే దంపతులు ఉన్నారు. వీరికి మరికొందరు జతకలిశారు. వీరంతా ఓ ముఠాగా మారి.. వ్యభిచార కేంద్రాన్ని గుట్టుచప్పుడుకాకుండా నడుపుతూ వచ్చారు. అయితే, తమ కేంద్రాలకు అవసరమైన అందమైన అమ్మాయిలను స్వదేశం నుంచే కాకుండా, విదేశాలకు కూడా తీసుకొస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్.ఐ.ఏ. హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీసుల సాయంతో ఈ ముఠాలోని పలువురు సభ్యులను అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో యూసుఫ్ ఖాన్ దంపతులను అరెస్టు చేసింది. 
 
అలాగే, వ్యభిచార గృహంలో ఉన్న ఐదుగురు బంగ్లాదేశ్ అమ్మాయిలకు విముక్తి కల్పించారు. కాగా, హైదరాబాద్‌లో ఎన్ఐఏ ఇలాంటి కేసును నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యూసుఫ్ దంపతులపై మనుషుల అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments