Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదు... ఎందుకు?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:14 IST)
హైదరాబాద్ నగరంలో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదైంది. ఈ కేసును నమోదు చేసింది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ కావడం గమనార్హం. ఈ తరహా కేసు నమోదు కావడం హైదరాబాద్ నగరంలో ఇదే తొలిసారి. ఈ తరహా కేసును ఎందుకు నమోదు చేయాల్సివచ్చిందో తెలుసుకుందాం. 
 
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యూసుఫ్ ఖాన్ - బేగం అనే దంపతులు ఉన్నారు. వీరికి మరికొందరు జతకలిశారు. వీరంతా ఓ ముఠాగా మారి.. వ్యభిచార కేంద్రాన్ని గుట్టుచప్పుడుకాకుండా నడుపుతూ వచ్చారు. అయితే, తమ కేంద్రాలకు అవసరమైన అందమైన అమ్మాయిలను స్వదేశం నుంచే కాకుండా, విదేశాలకు కూడా తీసుకొస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్.ఐ.ఏ. హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీసుల సాయంతో ఈ ముఠాలోని పలువురు సభ్యులను అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో యూసుఫ్ ఖాన్ దంపతులను అరెస్టు చేసింది. 
 
అలాగే, వ్యభిచార గృహంలో ఉన్న ఐదుగురు బంగ్లాదేశ్ అమ్మాయిలకు విముక్తి కల్పించారు. కాగా, హైదరాబాద్‌లో ఎన్ఐఏ ఇలాంటి కేసును నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యూసుఫ్ దంపతులపై మనుషుల అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments