Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదు... ఎందుకు?

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:14 IST)
హైదరాబాద్ నగరంలో తొలిసారి హ్యూమన్ ట్రాఫిక్ కేసు నమోదైంది. ఈ కేసును నమోదు చేసింది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ కావడం గమనార్హం. ఈ తరహా కేసు నమోదు కావడం హైదరాబాద్ నగరంలో ఇదే తొలిసారి. ఈ తరహా కేసును ఎందుకు నమోదు చేయాల్సివచ్చిందో తెలుసుకుందాం. 
 
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యూసుఫ్ ఖాన్ - బేగం అనే దంపతులు ఉన్నారు. వీరికి మరికొందరు జతకలిశారు. వీరంతా ఓ ముఠాగా మారి.. వ్యభిచార కేంద్రాన్ని గుట్టుచప్పుడుకాకుండా నడుపుతూ వచ్చారు. అయితే, తమ కేంద్రాలకు అవసరమైన అందమైన అమ్మాయిలను స్వదేశం నుంచే కాకుండా, విదేశాలకు కూడా తీసుకొస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తూ వచ్చారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థకు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్.ఐ.ఏ. హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీసుల సాయంతో ఈ ముఠాలోని పలువురు సభ్యులను అదుపులోకి తీసుకుంది. పక్కా సమాచారంతో యూసుఫ్ ఖాన్ దంపతులను అరెస్టు చేసింది. 
 
అలాగే, వ్యభిచార గృహంలో ఉన్న ఐదుగురు బంగ్లాదేశ్ అమ్మాయిలకు విముక్తి కల్పించారు. కాగా, హైదరాబాద్‌లో ఎన్ఐఏ ఇలాంటి కేసును నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యూసుఫ్ దంపతులపై మనుషుల అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments