Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమ ఎత్తిపోతలకు ఎన్‌జిటి బ్రేక్.. పర్యావరణ అనుమతులు తప్పనిసరి

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:06 IST)
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని జస్టిస్‌ రామకృష్ణన్‌, నిపుణులు సైబల్‌ దాసు గుప్తాలతో కూడిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ధర్మాసనం తేల్చి చెప్పింది.

రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి వరద రోజుల్లో రోజుకు మూడు టిఎంసిల నీటిని తీసుకునేలా, పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వగుండా 80 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.

రూ.3,278 కోట్లతో టెండర్లను కూడా ఖరారు చేసింది. ఈ పథకం పూర్తయితే తెలంగాణ ప్రాజెక్టులన్నీ దెబ్బతింటాయని, దీనికి ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది.

తెలంగాణకు చెందిన జి.శ్రీనివాస్‌ కూడా ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని ఎన్‌జిటిలో ఫిర్యాదు చేశారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ఎన్‌జిటి ఈ నెల 3న తీర్పును రిజర్వు చేసింది. గురువారం చెన్నరులోని ఎన్‌జిటి ఈ మేరకు తుది తీర్పును ప్రకటించింది.

కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నందువల్లే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టామనే ఆంధ్రప్రదేశ్‌ వాదనను తోసిపుచ్చింది. డిపిఆర్‌, ప్రాజెక్టు సంబంధిత అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విషయాన్ని ప్రస్తావించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం