Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధూవరులతో పాటు.. క్వారంటైన్‌లో 70 కుటుంబాలు

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (10:05 IST)
హాయిగా పెళ్లి చేసుకున్నారు.. కానీ పెళ్లి చేసుకున్న రెండో రోజే వరుడిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. వధువుతో సహా పెళ్లికి హాజరైన వారందరిని క్వారంటైన్‌ చేశారు. ఇందుకు కారణం.. కరోనా పరీక్షా ఫలితాలు రాకముందే వివాహం చేసుకోవడమే. 
 
ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మర్రిమానుతండాకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కరోనా టెస్టులకు నమూనాలు ఇచ్చాడు. 
 
వాటి రిపోర్టులు రాకముందే.. వెల్లుర్తి మండలం ఎల్‌.తండాకు చెందిన యువతిని ఈ నెల 10న వివాహాం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన విందులో వరుడు అస్వస్థతకు గురయ్యాడు. ఇదే సమయంలో వరుడికి కరోనా పాజిటివ్‌‌గా ఫలితం వచ్చింది.
 
వెంటనే అప్రమత్తమైన అధికారులు వరుడిని ఐసోలేషన్‌కు తరలించారు. అప్పటికే వరుడు అందరితో కలిసి భోజనం చేసినట్లు గుర్తించడంతో వధువుతో సహా పెళ్లి వేడుకలో పాల్గొన్న అందరిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. మొత్తం 70 కుటుంబాల నుంచి నమూనాలు సేకరించడంతో పాటు గ్రామాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments