Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారంలో భార్యాభర్తలు, ఉన్నట్లుండి కరెంట్ షాక్

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (19:52 IST)
కొత్తగా పెళ్ళయిన జంట. హాయిగా జాలీగా తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రెస్టారెంట్లు, బంధువులతో హడావిడి, స్నేహితులతో కాలక్షేపాలు.. ఇక భార్యాభర్తల మధ్య పిచ్చాపాటీ. ఇదంతా తెలిసిందేగా.
 
అయితే ఆ నూతన వధూవరుల జీవితంలో కరెంట్ షాక్ తగలడం చివరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పాకాల మండలం భారతం మిట్ట నాలుగోవీధిలో నివాసముండే మహ్మమద్ రఫి, షాహిద్ బేగంలకు రెండునెలల క్రితమే వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
 
బంధువులు కూడా వీరి జంటను చూసి అసూయపడేవారంటే వారు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చెప్పనవసరం లేదు. బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న రఫి వివాహం కోసం మూడునెలల పాటు సెలవులు పెట్టాడు. వివాహమైన తరువాత సొంత ప్రాంతం చిత్తూరు జిల్లాలోని పాకాలలో ఉన్నాడు.
 
వివాహ సెలవులు కావడంతో భార్యాభర్తలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బంధువుల ఇంటికి వెళ్ళడం.. వారి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో ఇద్దరూ ఒంటరిగా ఏకాంతంగా ఉన్నారు. ఆ సమయంలో ఉన్నట్లుండి ఇంటి పైకప్పులో ఉన్న ఫ్యాన్‌కు ఉన్న కరెంట్ వైరు ఒక్కసారిగా వీరిపై తెగి పడింది.
 
భార్యాభర్తల మధ్య పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. దాంతో పాటు బెడ్ కాలిపోవడం.. ఇంట్లో ఫర్నిచర్ మొత్తం కాలిపోవడంతో వీరు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యారట. నూతన వధూవరులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments