Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైనేజీలో నవజాత శిశువు.. బురద, ధూళితో కనిపించింది..

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని ఓ ఆసుపత్రి సమీపంలోని కాలువలో ఆదివారం ఉదయం నవజాత బాలిక కనిపించింది. ఆమె కేకలు విన్న స్థానికులు పాపను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పాప బురద, ధూళితో నిండిపోయింది. స్థానికులు ఆమెను డ్రెయిన్‌లో నుంచి బయటకు తీసి గుడ్డలో చుట్టి ఆస్పత్రికి తరలించారు.
 
ఆరోగ్యంగా ఉన్న నవజాత బాలికను పాలమనేరు ఏరియా ఆసుపత్రిలోని న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్‌లో ఉంచారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఓ మహిళ రక్తస్రావంతో ఆస్పత్రికి వచ్చిందని, అప్పుడే పుట్టిన తన బిడ్డ చనిపోయిందని చెప్పారని వైద్యాధికారి తెలిపారు. అయితే రెండు గంటల తర్వాత అదే పాపను ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. "మేము శిశువును అబ్జర్వేషన్‌లో ఉంచాము. ఆమె బాగానే ఉంది" అని డాక్టర్ చెప్పారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవజాత శిశువును కన్నతల్లి ఎందుకు డ్రైనేజీలో వేసిందనే దానిపై విచారణ జరుగుతోంది. బిడ్డ తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా ప్రసవించిందని, పాపను అక్కడే వదిలేసిందని, పాపను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించామని, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments