Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురికి జీవదానం చేసిన వివాహిత... ఎలా?

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:47 IST)
ఓ వివాహిత నలుగురి ప్రాణదానం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ వివాహిత అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో నలుగురు ప్రాణదానం పొందారు. మృతురాలి పేరు గండ్ర హరిత (26). తాను చనిపోతూ నలుగురికి పునర్జన్మ ఇచ్చింది. 
 
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గండ్ర హరిత భర్తతో కలిసి హైదరాబాద్ నగరంలో తన భర్తతో కలిసి ఉంటున్నారు. ఈమె భర్త యశ్వంత్ రెడ్డి హైదరాబాద్ నగరలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు పది నెలలో చిన్నారి కూడా ఉంది. 
 
ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి తలనొప్పింగా ఉందని చెప్పి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని సన్ షైన్ ఆస్పత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. 
 
జీవన్ దాన్ ప్రతినిధులు హరిత భర్త, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో హరిత కిడ్నీలు, కాలేయం, ఊపరితిత్తులు, నేత్రాలు సేకరించిన వైద్యులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో నలుగురికి అమర్చారు. దీంతో హరిత చనిపోయినప్పటికీ.. ఆ నలుగురి రూపంలో ఆమె బతికే ఉంటుందని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments