Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మహిళ పర్సను చోరీ చేసిన దొంగ... పట్టుకుని కిటికీకి వేలడాదీసిన ప్రయాణికులు

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:30 IST)
సాధారణంగా రద్దీగా ఉండే బస్సులు, రైళ్లలో జైబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల చేతికి చిక్కి దెబ్బలు తింటుంటారు. తాజాగా ఓ దొంగ రైలు ప్రయాణికురాలి వద్ద పర్సు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని రైలు కిటికీకి వేలడాదీశాడు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దొంగకు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 
బిహార్ రాష్ట్రంలోని బెగూసరాయ్‌ జిల్లా పరిధిలో శనివారం కటిహార్‌ నుంచి సమస్తిపుర్‌ వెళ్తున్న రైలులో ఓ మహిళ పర్సు చోరీకి గురైంది. కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు. వెంటనే లోపలి నుంచి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. కొన్ని కిలోమీటర్లు అలాగే వేలాడుతూ ప్రయాణించాక.. బచ్వారా జంక్షనులో రైలు ఆగింది. 
 
ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు అతణ్ని అప్పగించారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక విధంగా ఆ దొంగ ప్రాణాలను రైలు ప్రయాణికులు కాపాడారు. లేదంటే వేగంగా వెళుతున్న రైలు నుంచి కిందకు దూకివుంటే ఆ దొంగ ప్రాణాలు కోల్పోయేవాడని ప్రయాణికులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments