ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ... విడుదల చేసిన ప్రభుత్వం

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (08:58 IST)
రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం కొత్త  ఎక్సైజ్ పాలసీని విడుదల చేసింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇకపై మద్యం షాపులను నిర్వహించనుంది. ఈ ఏడాదికి 3 వేల 500 దుకాణాలను ప్రభుత్వం  నిర్వహించనుంది. మండలాలు, మున్సిపాల్టీలు,కార్పొరేషన్ల లో షాపుల ప్రదేశాలను  బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ గుర్తించనున్నారు.

150 నుంచి 300 చ.అడుగుల విస్తీర్ణంలో ఒక్కో మద్యం షాపు నిర్వహించనున్నారు. ప్రతి షాపుకు తెలుగు,ఇంగ్లీషుల్లో నెంబర్ బోర్డులు బేవరేజెస్ కార్పొరేషన్ వేయించనుంది. ప్రతి మద్యం దుకాణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల ఎంపికకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో షాపునకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమించనున్నారు. డిగ్రీ అర్హతతో సూపర్ వైజర్ కు 17 వేల 500 జీతం, ఇంటర్ అర్హతతో సేల్స్ మెన్ లకు 15 వేల జీతంతో నియమించనున్నారు.

పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ షాపులను నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments