Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికలు : టీడీపీ బలంతో గెలిచి వైకాపాలో జంప్

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (11:23 IST)
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే రెండు దశలు ముగిసిపోయాయి. బుధవారం మూడో దశ పోలింగ్ జరుగనుంది. అయితే, తొలి, రెండు దశల ఎన్నికల్లో గెలుపొందిన పలువురు అభ్యర్థులు వైకాపాలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ బలం, మద్దతుతో గెలుపొంది, ఇపుడు అధికార పార్టీలోకి దూకేస్తున్నారు. 
 
తాజాగా నెల్లూరు జిల్లాలో ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాలోని ఆత్మకూరులో రెండో విడతలో భాగంగా శనివారం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. 
 
సంగం మండలం చెర్లోవంగుల్లులో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పి.రఘురామయ్య అనుచరుడు కె.రామయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు. అనంతరం మాజీ సర్పంచ్‌తో కలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మంత్రి గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరూ వైసీపీలో చేరారు. 
 
అదేవిధంగా ఏఎస్‌పేట మండలం పెద్దబ్బీపురానికి చెందిన ఎ.మాధవరెడ్డి టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆదివారం ఆయన మంత్రి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఇదే మండలంలోని చౌటభీమవరం సర్పంచ్‌గా టీడీపీ మద్దతుతో విజయం సాధించిన లక్ష్మీనారాయణ కూడా వైసీపీలో చేరడం గమనార్హం. దీంతో వారి గెలుపునకు కృషి చేసిన టీడీపీ శ్రేణులు విస్తుపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments